For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Horoscope: ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా బాగుంటుంది...

01:57 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 01:57 PM May 03, 2024 IST
horoscope  ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా బాగుంటుంది
Advertisement

రానున్న రోజులలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు రాశుల వారికి చాలా బాగుంటుంది అని అంటున్నారు. 2020 చివరి నుంచి 2030 వరకు కొన్ని రాశుల వారికి ఆర్ధిక విలువ బాగా పెరగనుంది. వీరి జీవితంలో కొత్త వెలుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంతకాలం ఆర్ధికంగా వీళ్ళు పడ్డ కష్టాలు అన్నీ వదిలి, ఆర్ధికంగా ముందుకు వెళ్లే సమయం వీరికి ఆసన్నం అయ్యింది. దానం చేయడం వలన ఇంకా ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తులా రాశివారికి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వారు కొన్ని నియమాలు పాటించడం వలన ఇంకా మంచి ఫలితం వస్తుంది. అలాగే భగవంతునికి అభిషేకాలు చేయించాలి. ఇలా చేయడం వలన తులా రాశి వారికి మంచి ఆదాయం పెరుగుతుంది. వీరు ఎంత సంపాదించినప్పటికీ గర్వం మాత్రం రాకుండా చూసుకోవాలి. ఎవ్వరిని అవమానించే విధంగా మాట్లాడకూడదు. వారిని గౌరవిస్తూ మాట్లాడాలి. చేతనైనంత సహాయం చెయ్యాలి.

Advertisement GKSC

ఇకపోతే ఈ ఏడాది నుంచి పది సంవత్సరాలు వరకు సింహ రాశివారికి చాలా బాగుంటుంది. వీరు ప్రతీ పనికి ఆటంకం లేకుండా ముందుకు నడిచే విధంగా చూసుకుంటారు. వీరిని అందరూ దూరం చేసుకుంటూ ఉంటారు గాని, నిజానికి వీళ్ళే అందరికంటే మంచివారు. వీళ్ళు 2030 నాటికి మంచి స్థాయికి వెళ్తారు.

వృషభ రాశి వారి రెండవ స్థానం, అంటే ధన స్థానం. ఈ రాశిలో పుట్టినవారు, చాలా కీర్తి వంతులు, ధనవంతులు, ధైర్యవంతులు, బుద్ధిమంతులు వీరు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ రాశివారు ఇంతకాలంగా పడ్డ కష్టాలు అన్నిటి నుంచి బయటపడి, ఉన్నత శిఖరాలకు చేరుకునే మంచి రోజులు మొదలయ్యాయి.

Advertisement
Author Image