For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhakthi News : తిరుమల తిరుపతి దేవస్థానం TTD బోర్డు సభ్యుల జాబితా విడుదల

10:22 AM Sep 05, 2023 IST | Sowmya
Updated At - 10:22 AM Sep 05, 2023 IST
bhakthi news   తిరుమల తిరుపతి దేవస్థానం ttd బోర్డు సభ్యుల జాబితా విడుదల
Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం TTD బోర్డు సభ్యుల జాబితా విడుదల అయ్యింది. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగయ్యపేట), పొన్నాడ సతీష్‌ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి అవకాశం దక్కింది.

ఇక.. టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు(ఉంగుటూరు).. నాగ సత్యం యాదవ్‌(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా సుధీర్‌(శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, వై. సీతారామిరెడ్డి(మంత్రాలయం), శరత్‌, అశ్వద్థనాయక్‌లకు అనంతపురం నుంచి చోటు దక్కింది.

Advertisement GKSC

అలాగే.. తమిళనాడు నుంచి డాక్టర్‌ శంకర్‌, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్‌పాండే, తెలంగాణ నుంచి సీతా రంజిత్‌రెడ్డి( ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్‌ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్‌ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలె నియమితులయ్యారు.

Advertisement
Author Image