For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కన్నుల పండువగా 21వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్

12:43 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:43 PM May 13, 2024 IST
కన్నుల పండువగా 21వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్
Advertisement

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందజేస్తూ వస్తున్న “సంతోషం అవార్డ్స్” కి మాత్రం ఓ సుస్థిర స్థానం ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అవార్డులు కార్యక్రమం ఘనంగా జరుపుతూ వస్తున్న సంతోషం సురేష్ కేవలం తెలుగు మాత్రమే కాదు సౌత్ ఇండియన్ భాషలు అన్నిటికీ అవార్డులు అందిస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సుమారు పన్నెండు గంటల పారు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి.

సౌత్ ఇండియాలోని నాలుగు భాషల సినిమాలకు విభాగాల వారీగా అవార్డులు అందించారు. ఇక ఈ వేడుకలో సింగర్స్ మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ తమ గాత్రంతో ఆకట్టుకోగా అలనాటి నటి జయమాలిని కూడా రెండు స్టెప్పులు వేసి అలరించారు. ఇక ఊర్వశి రౌతేలా, వరినా హుస్సేన్ తమదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆర్పీ పట్నాయక్ కూడా కొన్ని పాటలు పాడి అలరించారు. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సింగర్ పీ సుశీల డాన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Advertisement GKSC

సౌత్ ఇండియా సెలబ్రిటీస్ ఎంతో మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాణిశ్రీ, రోజారమణి, దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు, ప్రకాష్ రాజ్, అల్లు అరవింద్, కవిత, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, రాజేంద్రప్రసాద్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, మురళీమోహన్, శేఖర్ మాస్టర్, సుధా, జయమాలిని, శ్రద్దా శ్రీనాథ్, కల్పిక, నక్షత్ర, శ్రీకాంత్, ప్రదీప్ రంగనాథన్, అడివి శేష్, బెనర్జీ, బాబు మోహన్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాదాల రవి, కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, నందమూరి రామకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, వంటివారు ఎందరో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
Author Image