For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Political : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ విషయంపై పలు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
political   హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ విషయంపై పలు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్
Advertisement

Political హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సందర్భంగా ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ పల ఆదేశాలు జారీ చేశారు..

మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక శాఖ, ఎయిర్‌పోర్ట్ అధికారులు హాజరయ్యారు..

Advertisement GKSC

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.. ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని అలాగే ట్రాఫిక్ విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నియమాలు పాటించాలని చెప్పారు

Advertisement
Author Image