For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Politics : రాజమహేంద్రవరంలో జగన్ పర్యటన..

12:44 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:44 PM May 13, 2024 IST
politics   రాజమహేంద్రవరంలో జగన్ పర్యటన
Advertisement

Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాకకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు కలెక్టర్ మధులీల..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఈయన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కలిశారు వీధితో పలు ఆసక్తికర విషయాలను చర్చించినట్టు సమాచారం అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత జనవరి 4వ తారీఖున రాజమహేంద్రవరంలో పర్యటించినట్టు తెలుస్తోంది ఇందుకుగాను అన్ని విధాల సిద్ధమవుతుంది రాజమహేంద్రవరం..

Advertisement GKSC

జగన్ రాకకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు కలెక్టర్ మధులీల అలాగే ఆ సమయానికి రోడ్లు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్మీ అధికారులను ఆదేశించారు అంతేకాకుండా జగన్ పర్యటనకు సంబంధించిన విషయాలను తెలిపారు.. ముఖ్య మంత్రి జగన్‌ జనవరి 3వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్‌ స్టేడియంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్‌షో ద్వారా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు వస్తారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్‌ భరోసా పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశం ఇస్తారు. సందర్భంగా దీనికి సంబంధించిన నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.. అంతేకాకుండా ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రజలతో పలు విషయాలు మాట్లాడినట్టు తెలుస్తుంది బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది

Advertisement
Author Image