Gossip రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి హీరోయిన్ ఎవరంటే..
Gossip : దర్శక వీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.. ఇందులో మహేష్ సరసన నటించడానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ తీసుకున్నట్టు తెలుస్తుంది..
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మహేష్తో గ్లోబల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచెరస్ జోనర్లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబుకు అంతర్జాతీయంగా క్రేజ్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా ssmb 29 పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రాజెక్టు ఇప్పటికే స్క్రిప్ట్ దశలోనే ఉందని.. షూటింగ్ మొదలవటానికి ఇంకా సమయం పడుతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి..
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం రాజమౌళి దీపిక పదుకొనేను ఎంచుకున్నట్లు సమాచారం. దీపికా ఇప్పటికే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తుంది. రాజమౌళి అడిగితే దీపిక నో చెప్పే ఛాన్స్ లేదు. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ మహేష్ బాబు దీపిక కాంబినేషన్లో సినిమా రావటం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.