For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : ఏంటి మొహానికి ఈ మచ్చలు వేసుకొనే హీరో అయిపోదాం అనుకుంటున్నావా అన్నారు.. సిద్దు జొన్నలగడ్డ

12:27 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:27 PM May 13, 2024 IST
entertainment   ఏంటి మొహానికి ఈ మచ్చలు వేసుకొనే హీరో అయిపోదాం అనుకుంటున్నావా అన్నారు   సిద్దు జొన్నలగడ్డ
Advertisement

Entertainment నందమూరి నరసింహ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 మొదలైంది.. తనదైన రీతిలో పోస్ట్ చేస్తూ సీజన్ వన్ ఎంత సక్సెస్ఫుల్ చేశారో తెలిసిందే అయితే ఇప్పుడు సీజన్ 2 లో కూడా ప్రముఖ హీరోలతో ముందుకు దూసుకుపోతున్నారు అయితే తాజాగా డీజెటిల్లు హీరో సిద్దు సిద్దు జొన్నలగడ్డ, యంగ్ హీరోలు విశ్వక్ సేన్ వచ్చారు.. ఈ సందర్భంగా తన మనసులో విషయాలను పంచుకున్నారు..

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ సక్సెస్ కాగా.. ఇప్పుడు రెండో సీజన్ కూడా మొదలైపోయింది. ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్‌లు రావడంతో ఆ ఎపిసోడ్ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఓటీటీలో అన్ స్టాపబుల్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుని పోతుండగా.. రెండో ఎపిసోడ్‌కి సంబంధించి రెండో ప్రోమో వచ్చేసింది..

Advertisement GKSC

ఇందులో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ తాను సినిమా రంగంలో నిలదొక్కుకోటనికి ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు.. ఇండస్ట్రీలో నువ్వు ఎదుర్కొన్న అవమానం ఏంటని బాలయ్య అడగ్గా.. నేను హీరోగా చేద్దాం అన్నా అని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్తే ఏంటి ఈ మొహానికి ఈ మచ్చలు వేసుకొనే నువ్వు హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అని అవమానించారు.. చెప్పగా బాలయ్య వెంటనే నాకు వస్తున్నాయి కంట్లో నీళ్లు అంటూ అతని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నారు.. యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సిస్టర్ కు హెల్త్ ఎంతో సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో కూడా రాత్రంతా హాస్పిటల్ లో ఉండి ఉదయాన్నే షూటింగ్ రావాల్సి వచ్చిందని అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబం దగ్గర ఉండలేకపోయాను అంటూ తన బాధను చెప్పుకొచ్చారు..

Advertisement
Author Image