ఫిబ్రవరి 10న శర్వానంద్, రష్మిక మందన్నా, "ఆడవాళ్లు మీకు జోహార్లు" టీజర్
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం పోస్టర్లు, ఒక పాటతోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతోనే ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న టీజర్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శర్వానంద్, రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి చూపించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
సాంకేతిక బృందం: దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్, పీఆర్వో: వంశీ-శేఖర్.