Political : హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి ఓటమికి అసలు కారణాలు ఇవే..
Political తాజాగా జరిగిన హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేని సంగతి తెలిసిందే. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని కొనసాగించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ లో అధికారం మారుతూ ఉంటుంది.. అదే ఈ సంవత్సరం కూడా కొనసాగింది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి కేవలం 25 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ 39 స్థానాలు గెలుచుకుంది.
ఈ విధంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది. మళ్లీ ఐదు సంవత్సరాలు తర్వాత బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే బిజెపి నుంచి పది మంది రెబల్ ఎమ్మెల్యే లు పోటీ చేశారు. వాళ్లు బిజెపి ఓట్లను చీల్చరు. దీనివల్ల బిజెపి అన్నది చాలా ఇబ్బందికర పరిస్తితి ఈ ఎన్నికల్లో చూసింది. కేవలం 1000 ఓట్ల తేడాతోనే పదిమంది బిజెపి అభ్యర్థులు ఓడిపోయారు. దీనివల్ల బిజెపి రాష్ట్రంలోని అధికారానికి దూరమైంది.
ఈ విషయం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని కలిగించినట్లు అయింది. అలాగే రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర దీని మీద కూడా ప్రభావం చూపించిందని కొంతవరకు భావించవచ్చును. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ప్రియాంక గాంధీ చాలా వరకు తన శాయా శక్తులు మేర కృషి చేసి పార్టీ విజయానికి చాలా కృషి చేశారు. అలాగే ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ తమ ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు..