Entertainment : శ్రీవారిని సేవలో సూపర్ స్టార్ రజనీకాంత్..
Entertainment కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత సేవలో పాల్గొన్నారు రజనీకాంత్..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయం లో శ్రీవారి దర్శనం చేసుకున్నారు రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో కలిసి దర్శనానికి వచ్చిన రజనీకాంత్ విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత సేవలో పాల్గొన్నారు... అనంతరం రజనీకాంత్, ఆయన కూతురికి పండితులు వేదాశీర్వచనం అందించగా టిటిడి అధికారులు ప్రసాదం అందించారు. అలాగే గత రాత్రి తిరుమలలోని వీరందరూ బస చేసినట్టు సమాచారం..
అలాగే తిరుమల దర్శనం తర్వాత రజనీకాంత్ కడప వెళ్ళనున్నారు. అక్కడ కొలువై ఉన్న అమీన్పీర్ దర్గాను ఆయన దర్శించుకోనున్నారు. ఈ దర్గా చాలా ప్రసిద్ధి చెందింది.. ఇక్కడకు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు.. అలాగే రజిని కాంత్ తో పాటుగా ఈ దర్గాను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా సందర్శించనున్నట్టు సమాచారం. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో ఏ ఆర్ రెహమాన్ ఈ దర్గాకు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.. అలాగే తనకు ఎంతో సెంటిమెంట్ గా ఉన్నా ఈ దర్గాకు ఈసారి ఏఆర్ రెహమాన్ రజినీకాంత్ తో కలిసి రానున్నారు.