Political : ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్.. ఎంపీ ఆర్.కృష్ణయ్య
Political విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ ఘనంగా జరుగుతుంది బీసీ నేతలు అంతా ఈ సభకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు పలువురు నేతలు..
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీనేతలు హాజరయ్యారు అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వచ్చారు ఇక్కడ జగన్కు ఘన స్వాగతం లభించింది.. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినా జగన్ మహాత్మ జ్యోతి ఫూలే మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా పలువురు నేతలు జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచేత్తారు.. అలాగే ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశంసలతో ముంచేశారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని అన్నారు. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు ఆర్. కృష్ణయ్య పిలుపుఇచ్చారు. ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు..