'పులి' చిత్రం బాహుబలి, RRR స్థాయిలో వుంటుంది : చిత్ర యూనిట్
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా 'అమ్మదొంగ' లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 'పులి' అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'The 19th century' అన్నది ఉపశీర్షిక. ఈ రోజు పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సిజు విల్సన్, హీరోయిన్ కాయాదు లోహర్ , దర్శకుడు వినయన్, నిర్మాత సుధాకర్ బాబు, ప్రసాద్ నాయక్, కె ఎల్. దామోదర్ ప్రసాద్ తదితరులు టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
అనంతరం నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు మాట్లాడుతూ... ఈ సినిమా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని తెలుగు లో విడుదల చేస్తునందుకు చాలా ఆనందంగా వుంది. సమాజంలో అసమానతలపై పోరాడిన ఓ వీరుడి కథ ఇది. అలాగే అనంతపద్మనాభ స్వామి నగలకు సంబధించిన చరిత్ర కూడా ఇందులో ప్రధాన కథాంశం. దర్శకుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సినిమాలో ప్రతి సన్నివేశం క్లైమాక్స్ లా వుంటుంది. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. ఇందులో నాలుగు పాటలు కూడా ఎక్స్ టార్డినరీగా వుంటాయి. త్వరలోనే పాటలు కూడా విడుదల చేస్తాం.
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ స్థాయిలో 'పులి' సినిమా వుండబోతుంది. థియేటర్లో అనుభూతి చెందాల్సిన సినిమా పులి. ప్రేక్షకులు తప్పకుండా వచ్చి చూస్తారనే నమ్మకం వుంది. మా స్నేహితుడు ప్రసాద్ కూడా ఈ చిత్రంపై వున్న ఆసక్తితో సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి పేరు రామచంద్ర నాయిక్. మేమిద్దరం కలసి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. వారం రోజుల్లో డేట్ అనౌన్స్ చేస్తాం. ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.