For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అయోధ్య ఆలయాన్ని సందర్శించిన 'హను-మాన్' చిత్ర యూనిట్

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
అయోధ్య ఆలయాన్ని సందర్శించిన  హను మాన్  చిత్ర యూనిట్
Advertisement

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇటివలే విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్‌ టీజర్ యావత్ దేశం హనుమంతుని నామం జంపించేలా చేసింది.

నిన్న, దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రారంభించడానికి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు.

Advertisement GKSC

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టాప్- గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

Advertisement
Author Image