For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : టాలీవుడ్ ను కదిలిస్తున్న పంచతంత్రం నిర్మాత లెటర్..

12:41 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:41 PM May 13, 2024 IST
entertainment   టాలీవుడ్ ను కదిలిస్తున్న పంచతంత్రం నిర్మాత లెటర్
Advertisement

Entertainment ఈ శుక్రవారం టాలీవుడ్లో 15 సినిమాలు విడుదలవుతున్నాయి ఈ సందర్భంగా ఓ నిర్మాత రాసిన లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది..

నిర్మాత అంటేనే సినిమాని ముందు ఉండి నడిపించే వ్యక్తి..  సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన నిర్మాత జీవితం మారిపోతుంది..  సినిమా ఎలా ఉంది అనే విషయం క్షణాల్లో తేలిపోతుంది..  విడుదలైన మొదటి రోజు ఫస్ట్ షో వరకు కూడా ఆగాల్సిన అవసరం లేకుండా పోతుంది ఒకవేళ ఆ సినిమా పైన నెగెటివ్ టాక్ వస్తే నిర్మాత తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల అయితేనే నిర్మాతలకు నిద్ర పట్టదు అలాంటిది రేపు ఒక్క రోజే 15 సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా పంచతంత్రం నిర్మాత లెటర్ ను విడుదల చేశారు.

Advertisement GKSC

రేపు రిలీజ్ కాబోయే చిత్రాల్లో పంచతంత్రం కూడా ఒకటి.. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ రాసిన ఓ లెటర్ లో ఏముందంటే... ‘18 నెలల సుదీర్ఘ నిరీక్ష తర్వాత మా సినిమాను మీ అభిమాన థియేటర్లకి తీసుకొస్తున్నాం. ఎన్నో ఏళ్ల మా కలను మీ ముందు పెడుతున్నాం. తప్పకుండా చూడండి.  ముఖ్యంగా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. చిన్నప్పుడు మీ ఇంట్లో తాత చెప్పిన కథలు గుర్తుకువస్తాయి! మీరు ఖచ్చితంగా ఈ కథతో ప్రేమలో పడతారు. మా సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, గుండెల్ని హత్తుకుంటుంది. ఈ చక్కని అనుభూతి కోసం మీరు తప్పకుండా మా పంచతంత్రం చూడాల్సిందే. మీరు మాత్రమే ఈ సినిమాకు న్యాయం చేయగలరు.. నచ్చిన నచ్చకపోయినా మా సినిమాను తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.

Advertisement
Author Image