For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ప్రభాస్ ఆదిపురుష్‌తో మాకే సంబంధం లేదు'

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
 ప్రభాస్ ఆదిపురుష్‌తో మాకే సంబంధం లేదు
Advertisement

ప్రభాస్ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా రానున్న ఈ మూవీ టీజర్ దసరా సందర్భంగా అక్టోబరు 2న ఆయోధ్య రామయ్య సన్నిధిలో రిలీజ్ అయ్యింది. మిశ్రమ టాక్ దక్కించుకున్న ఈ టీజర్‌లో ఎక్కువగా గ్రాఫిక్స్ ఉన్నాయి. విజువల్స్ చూస్తే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తున్నాయని, వీఎఫ్‌ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్‌ అలా చేయడంతో..

Advertisement GKSC

డైరెక్టర్ ఓంరౌత్ గ్రాఫిక్స్‌కు సంబంధించిన ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలాకు ఈ మూవీ టీజర్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఈ సంస్థే గ్రాఫిక్స్‌ చేసిందని భావించి వీఎఫ్ఎక్స్ వాలా అనే ఎకౌంట్‌ను ట్యాగ్‌ చేస్తూ గ్రాఫిక్స్‌ ఇంకాస్త మెరుగుగా ఉంటే టీజర్‌ అదరగొట్టేది అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా ప్రకటన

దీంతో వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్ సినిమాకు తాము గ్రాఫిక్స్ అందించలేదని.. ఈ సినిమాకు మాకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. మూవీకి సంబంధించిన సీజీ లేదా ఇతర ఏ ఎఫెక్ట్స్‌ మేము చేయలేదు అని తాజా ప్రకటన రిలీజ్‌ చేసింది బాలీవుడ్‌ స్టార్ అజయ్‌దేవ్‌గణ్‌కు చెందిన ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌ వాలా సంస్థ.

Image

Advertisement
Author Image