For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : విశాల్ తెలుగు బిడ్డ.. అతనికి చాలా పొగరు.. మోహన్ బాబు..

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
entertainment   విశాల్ తెలుగు బిడ్డ   అతనికి చాలా పొగరు   మోహన్ బాబు
Advertisement

Entertainment తెలుగువాడైనప్పటికీ తమిళ హీరోగా స్థిరపడిపోయాడు హీరో విశాల్. అయితే తాజాగా ఈయన నటించిన లాఠీ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలు చెన్నైలో జరగ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంచు మోహన్ బాబు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు..

తాజాగా విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైన మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. "తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్‌ ఇక్కడి వచ్చాడు. మనం ఆయన్ను ప్రేమించాలి, గౌరవించాలి. మా సినిమాలకు సంబంధించిన వేడుకలకు మినహా నేను 8 ఏళ్ల నుంచి బయటి వాటికి వెళ్లడంలేదు. విశాల్‌ చనువు తీసుకుని 'అంకుల్‌.. తిరుపతిలో ఫంక్షన్‌ ఉంది. మీరు రావాలి' అని కోరాడు. నేను వెంటనే ఓకే అని చెప్పా. ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. విశాల్‌ తండ్రి నన్ను హీరోగా పెట్టి 'యమ్‌ ధర్మరాజు: ఎంఏ' అనే సినిమా తీశారు. 'పందెం కోడి'లోని విశాల్‌ నటన నాకు బాగా నచ్చింది.. ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు. 'ప్రేమ చదరంగం', 'పొగరు'లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మెప్పించాడు. విశాల్‌కు నిజంగానే కొంచెం పొగరు ఉంది ఆ విషయం నాకు కూడా తెలుసు అయితే మనిషికి పవర్ ఉండాలి కానీ అది ఎదుటి మనిషికి హాని చేసేలా ఉండకూడదు.. 'లాఠీ' కానిస్టేబుల్‌ కథ. సమాజంలో ఏం జరిగినా ముందు తెలిసేది కానిస్టేబుల్‌కే. పోలీసు డిపార్ట్‌మెంట్‌ను నేను గౌరవిస్తా. ట్రైలర్‌ చూశా.. బాగుంది. ఈ సినిమా 'పందెం కోడి'లా మంచి హిట్‌ అవుతుంది'' అన్నారు మోహన్ బాబు..

Advertisement GKSC

Advertisement
Author Image