Entertainment : తమన్ సంగీతంపై మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఏమన్నారు అంటే..
Entertainment మెలోడీ బ్రహ్మ మణిశర్మ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఆయన తన దగ్గర పనిచేసిన వారి కోసం తన శిష్యుల కోసం చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
మణిశర్మ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఆయన తన దగ్గర పనిచేసే శిష్యుల కోసం చెప్పుకొచ్చారు దేవిశ్రీప్రసాద్ తమ వంటి వారందరూ నా దగ్గర సంగీతం నేర్చుకున్నారు అంటూ చెప్పిన ఆయన.. " నా శిష్యుల్లో చాలామంది సంగీత దర్శకులు అయ్యారు.. హేరిస్ జయరాజ్, దేవీశ్రీ ప్రసాద్, తమన్.. వీళ్లందరూ నా దగ్గర చేసినవాళ్లే. దేవీ శ్రీ ప్రసాద్ను సింగర్ చేసింది కూడా నేనే అనుకుంటా. అయితే వీళ్లందరిలో జీరో నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం తమన్. తన సహనమే అతడిని ఇంతవాడిని చేసింది. నా దగ్గర ఉన్నప్పుడు పని ఒత్తిడిలో నేను ఏది ఉంటే అది విసిరేసేవాడిని. టీవీ వెనక్కి వెళ్లి దాక్కునేవాడు. ఏఆర్ రెహమాన్ తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది.. రెహమాన్ నన్ను 'ఓయ్' అని పిలుస్తారు. నాకు పాటలు పాడడం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఉంటాం సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటాం ఆయన నాకంటే గొప్ప ప్లేయర్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే ఆయనకు ఆస్కార్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఆయన ఆస్కార్కు అర్హుడు కూడా.." అంటూ చెప్పుకొచ్చారు..