For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment నెలకు 8 లక్షలు భరణంగా ఇవ్వాలని ప్రముఖ కమెడియన్ పృథ్విను ఆదేశించిన కోర్టు.

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
entertainment నెలకు 8 లక్షలు భరణంగా ఇవ్వాలని ప్రముఖ కమెడియన్ పృథ్విను ఆదేశించిన కోర్టు
Advertisement

Entertainment  ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృథ్వికు కోర్టు షాక్ ఇచ్చింది తనను వేధిస్తున్నాడంటూ పృథ్వి భార్య పెట్టిన కేసును విచారించిన కోర్టు ఆమెకు ప్రతినెల 8 లక్షలు మరణంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది..

టాలీవుడ్ కమెడియన్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అందరికీ సుపరిచితుడైన పృథ్వికు పెద్ద షాక్ తగిలింది. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో వివాదాలు వచ్చి ఆమెను వదిలిపెట్టాడు. అయితే ఈ విషయంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2015లో తనను బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటివేసాడని కోర్టులో కేసు వేసింది. అంతేకాకుండా పృథ్వి సినిమాలు ద్వారా నెలకు 30 లక్షల వరకు సంపాదిస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈ విషయంపై విచారణ జరిపించిన హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆమెకు ప్రతినెల 10వ తారీకు వచ్చేటప్పటికి కచ్చితంగా ఎనిమిది లక్షలు భరణంగా ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా కోర్టులో కేసు వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆమె ఖర్చులన్నీ తిరిగి ఆమెకి చెల్లించాలని చెప్పింది. అయితే ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇవ్వాలి అంటే పృద్వి నెలకు ఎంత సంపాదించాలి. ఇందుకు ఆయన చాలా కష్టపడాలి. పిటీషన్ లో ఆయన భార్య తప్పుగా పేర్కొనైనా ఉండాలి. ఇంత మొత్తం సంపాదించడం ఆయనకు సాధ్యమైనా అంటూ ఈ విషయం తెలిసినవాళ్లంతా తమదైన రీతిలో స్పందిస్తున్నారు..

Advertisement GKSC

అయితే విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌‌‌తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు

Advertisement
Author Image