For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Jahnvi Kapoor : వాటి వల్లే నా ఈ‌ఎం‌ఐ లు త్వరగా కట్టగలుగుతున్నానని అంటున్న... జాన్వీ కపూర్ !

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
jahnvi kapoor   వాటి వల్లే నా ఈ‌ఎం‌ఐ లు త్వరగా కట్టగలుగుతున్నానని అంటున్న    జాన్వీ కపూర్
Advertisement

Jahnvi Kapoor : దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో అతి తక్కువ సమయం లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు వెండితెరపై సందడి చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టి్వ్‏గా ఉంటుంది జాన్వీ. సోషల్ మీడియాలో జాన్వీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈమెకు కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే దాదాపు 2.3 కోట్లు (20.3 మిలియన్స్) ఫాలోవర్స్ ఉన్నారు. జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ మాత్రం గ్లామరస్ గా ఉంటాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు.

జాన్వీ కపూర్ ఇటీవల మిలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు లోనూ విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జాన్వీ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియా ఫోటోస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇన్ స్టాలో మీరు పోస్ట్ చేసే అల్ట్రా గ్లామరస్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు... వెండి తెరపై మీ డి గ్లామరస్ పాత్రలను అంగీకరించలేకపోతున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించింది.

Advertisement GKSC

అందుకు సమాధానంగా జాన్వీ మాట్లాడుతూ... “వాస్తవానికి నేను నా నిజ జీవితంలో తెరపై కనిపించే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాను. నేను సోషల్ మీడియాలో సరదాగా గడపాలనుకుంటాను... నేను దీనిని అంత సీరియస్ గా తీసుకోను. నేను క్యూట్ గా కనిపిస్తే మరో ఐదుగురు వ్యక్తులు నాఫోటోలను ఇష్టపడితే నేను అదనంగా మరొక బ్రాండ్ ను పొందుతాను. ప్రకటనల్లో నటించి నా ఈఎంఐలు చెల్లించగలనని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు కంటే చాలా సులభంగా ఇప్పుడు ఈఎంఐలు చెల్లిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాలో జాన్వీ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Advertisement
Author Image