For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sukumar: విరూపాక్ష కథలో మార్పులు చేసిన సుకుమార్ .. మొదట విలన్ గా ఇంకో క్యారెక్టర్ అనుకున్నారు,కానీ ఏం జరిగింది అంటే ...

11:47 AM May 26, 2023 IST | Sowmya
Updated At - 11:47 AM May 26, 2023 IST
sukumar  విరూపాక్ష కథలో మార్పులు చేసిన సుకుమార్    మొదట విలన్ గా ఇంకో క్యారెక్టర్ అనుకున్నారు కానీ ఏం  జరిగింది అంటే
Advertisement

Sukumar : హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులని భయపెట్టి సస్పెన్స్, థ్రిల్లింగ్, ట్విస్టులతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ఈ సినిమా తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశాడు. ఈ సినిమా కథలో మార్పులు, చేర్పులు కూడా సుకుమార్ గారే చేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా అందరూ హీరోయిన్ సంయుక్త పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా మొదట్లో ఎంతో క్యూట్ గా చూపించి చివర్లో తనే విలన్ గా చూపించడం, సంయుక్త అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో సంయుక్త నటనకు అంతా ఫిదా అయ్యారు.

Advertisement GKSC

సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మొదట రాసుకున్నప్పుడు తేజ్ క్యారెక్టర్ కి అక్కగా నటించిన శ్యామలను విలన్ గా అనుకున్నాం. చివర్లో తానే మొత్తం చేసేలాగా అనుకున్నాం. కానీ సుకుమార్ గారు కథలో కొన్ని మార్పులు చేశారు. మెయిన్ విలన్ గా హీరోయిన్ సంయుక్తని పెట్టమన్నారు. అస్సలు హీరోయిన్ని విలన్ గా చూపించాలి అనే ఆలోచన కొత్తగా అనిపించింది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే, కథ మార్చాము. అది థియేటర్స్ లో బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ విలన్ అనేది థియేటర్స్ లో బాగా పేలడమే కాకుండా, సంయుక్త యాక్టింగ్ కూడా ప్లస్ అవ్వడంతో సినిమా ఇంత భారీ విజయం సాధించింది అని అన్నారు. మొత్తానికి మరోసారి సుకుమార్ తన మాస్టర్ మైండ్ తో సినిమాలో మార్పులు చేసి పెద్ద హిట్ ఇచ్చాడని అంటున్నారు సుక్కు అభిమానులు.

Advertisement
Author Image