For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie నిర్మాతల మండలిలో మళ్లీ విభేదాలు.. ఏం జరిగిందంటే?

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
movie నిర్మాతల మండలిలో మళ్లీ విభేదాలు   ఏం జరిగిందంటే
Advertisement

Movie తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గడువు ముగిసినా నిర్మాతల మండలికి ఎన్నికలు జరపడం లేదంటూ శనివారం ఉదయం పలువురు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు సి.కల్యాణ్ నియంతృత్వ ధోరణి వల్ల నిర్మాతల మండలిలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.

ఎప్పటికప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా నిర్మాతల మండలిలో సర్వసభ్య సమావేశాలు జరపడం లేదని, సభ్యులకు లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. వెంటనే నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయపోరాటనికి కూడా దిగుతామని వారు తెలిపారు.

Advertisement GKSC

తాజాగా నిర్మాతల మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది.. ఆర్టిస్టులకు మరియు టెక్నీషియన్స్ కు రోజు వారి చెల్లింపులు ఉండవని.. సినిమా కు కావాల్సిన డేట్ల అనుసారంగా గంపగుత్త పారితోషికం మాట్లాడుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.. అయితే జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే ఇకనుంచి రోజువారి వేతనాలు వుంటాయని.. నటీ నటుల యొక్క పర్సనల్‌ స్టాప్‌ కి మరియు వారి యొక్క బస అన్ని విషయాలను కూడా సొంత ఖర్చులతో బరించాల్సిందే అని నిర్ణయాలు తీసుకుంది.. అయితే ఈ విషయం పైన నిర్మాతల మండలిలో పలు అభిప్రాయ బేధాలు వచ్చాయి.

Advertisement
Author Image