For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Devotional : కార్తీకమాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను మరచిపోకండి..!

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
devotional   కార్తీకమాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను మరచిపోకండి
Advertisement

Devotional : ఈ కార్తీకమాసంలో అందరూ పూజలు, వ్రతాలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబుతుంటారు. మనం చేసిన పాపాలను తొలగించి విముక్తి చేస్తుందని కార్తీక మాసం లో ఇలాంటివి అనుసరిస్తూ వుంటారు భక్తులు. దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది.

అందుకే కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపారాధన చేస్తారు. అయితే దీపం లక్ష్మీదేవి స్వరూపం. అందుకే ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో సిరిసంపదలు వెదజల్లుతాయి. అయితే పూజలో దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే దీపారాధన చేసేటప్పుడు కొన్ని విషయాలను ముఖ్యంగా పాటించాలని అంటున్నారు. అవేంటో మీకోసం...

Advertisement GKSC

  • దీపం పెట్టేటప్పుడు మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే వెలిగించాలి.
  • అలానే దీపం పెట్టేటప్పుడు ముందు ఒత్తు వెయ్యకూడదు.
  • మొదట ప్రమిద వేసి ఆ తరవాత ఒత్తు వెయ్యాలి.
  • అంతే కానీ ముందు నూనెను లేదా నెయ్యిని వేయకుండా ఒత్తు వెయ్యకూడదు.
  • అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు మొదట ఒక దీపం వెలిగించి తరవాత ఆ దీపం సహాయంతో మరొక దీపాన్ని వెలిగించాలి.
  • కొందరు సాధారణంగా ఐదు దీపాలను వెలిగిస్తారు. ఎందుకంటే... తొలి వత్తు భర్తకు, పిల్లలకు, రెండోది కుటుంబ సభ్యుల క్షేమం కోసం, మూడవది సోదర సోదరీమణుల క్షేమం కోసం, నాల్గవది ధర్మానికి ప్రతీకగా, అయిదవది వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు.

ఈ సూచనలను పాటించి దీపాన్ని వెలిగించాలని గుర్తుంచుకోండి.

Advertisement
Author Image