Pooja Hegde :" గుంటూరు కారం " మూవీ నుండి పూజ హెగ్డే ని తీసేసారని టాక్ .. ఈ విషయం నిజమేనా ? తెలియాలి అంటే ....
.... అసలు సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణను కూడా పూర్తి చేసుకుంది. జూలై నుంచి కొత్త షెడ్యూల్ను తెరకెక్కించాలనేది ప్లానింగ్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలను చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇంతకీ అంతలా ఏం జరిగిందని అనుకుంటున్నారా? రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి రెండు ప్రధానమైన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి రూమర్సో లేక నిజమో తెలియదు కానీ.. నెట్టింట మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి మరి.
‘గుంటూరు కారం’కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో మొదటిది మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించింది. తమన్ను ఈ సినిమా నుంచి తీసేశారు. ఆయన స్థానంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ రాబోతున్నారని టాక్. అయితే ఈ వార్తలపై అదే రేంజ్లో రివర్స్ ఎటాక్ చేశారు తమన్. కడుపు మంటకు అరటిపళ్లు తినాలంటూ సెటైరికల్గా కామెంట్స్ చేశారు. అలాగే ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను కూడా పక్కకు పెట్టేశారని. ఆమె స్థానంలో కోలీవుడ్ హీరోయిన్ త్రిషను తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే స్పందిస్తే అది అబద్ధం అవుతుంది. ఆమె సైలెంట్గా ఉంటే మాత్రం నిజమనే అందరూ అనుకుంటారనటంలో సందేహం లేదు.