వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు మా బ్రదర్ లా వున్నారు : రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మెగా మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరైన వీరయ్య విజయ విహారం’’వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా చిత్ర యూనిట్ కు షీల్డ్స్ ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి అభినందనలు. నాకు రంగస్థలం లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చారు. నాకే కాదు వారితో పని చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. సినిమా అంటే అంకితభావం వున్న నిర్మాతలు. నిజంగా దమ్మున్న నిర్మాతలు. బాబీ గారికి బిగ్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్య చూశాను ప్రతి ఫ్రేం ని అద్భుతంగా మలిచారు బాబీ..
చిరంజీవి గారు మా నాన్న గారి లా లేరు.. మా బ్రదర్ లా వున్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రవితేజ గారి తో ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం. దేవిశ్రీ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.