For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కేథరిన్‌ త్రెసా, సందీప్‌ మాధవ్‌ హీరో, హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ దర్శకుడి భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌

06:33 PM Jul 02, 2023 IST | Sowmya
Updated At - 06:33 PM Jul 02, 2023 IST
కేథరిన్‌ త్రెసా  సందీప్‌ మాధవ్‌ హీరో  హీరోయిన్‌గా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ దర్శకుడి భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌
Advertisement

దర్శకుడు అశోక్‌ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్‌ తేజ ఇప్పుడు యాక్షన్‌ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు.

కేథరిన్‌ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్‌ మాధవ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్‌ ఫిల్మ్స్‌, శ్రీ మహావిష్ణు మూవీస్‌ బ్యానర్లపై ప్రొడక్షన్‌ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్‌, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

Advertisement GKSC

‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్‌ రివీల్‌ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్‌ తేజ యాక్షన్‌ థ్రిల్లర్‌ను అంతకుమించి అద్భుతంగా రూపొందిస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేథరిన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయినా కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటారు. కొత్త దర్శకుడితో కథ ఓకే చేసింది అంటే సినిమా పాయింట్‌ ఆసక్తికరమైనదే అని అర్థమవుతోంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

Advertisement
Author Image