For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : అవతార్ 2 నిడివి చూసి అమ్మో అంటున్న అభిమానులు..

12:41 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:41 PM May 13, 2024 IST
entertainment   అవతార్ 2 నిడివి చూసి అమ్మో అంటున్న అభిమానులు
Advertisement

Entertainment 2009లో వచ్చిన అవతార్ సినిమాకి సీక్వెల్ గా ఎక్కిన అవతార్ టు చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెర్న్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం వైరల్ గా మారగా ఇప్పుడు ఈ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది..

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విజువల్ వండర్ సినిమా 'అవతార్‌2'. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నీడివి కోసం ప్రస్తుతం పెద్ద రచ్చ జరుగుతుంది.. అవతార్ 2 నిడివి ఎక్కువగా ఉందని అంత సమయం జేమ్స్ కామరూన్ అభిమానుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలడా అనే వార్తలు వినిపిస్తున్నాయి... 'అవతార్‌2' నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి. 3డీ ఐమ్యాక్స్‌, 4డీ అనుభూతి కలిగిన థియేటర్‌లలో సినిమా చూడాలంటే దాదాపు రూ.1000పైనే టికెట్‌ ధర (మెట్రో నగరాల్లో) ఉండటం గమనార్హం.

Advertisement GKSC

Advertisement
Author Image