For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Anchor Rashmi : జబర్దస్త్ కొత్త యాంకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మి..!

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
anchor rashmi   జబర్దస్త్ కొత్త యాంకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మి
Advertisement

Anchor Rashmi : ప్రముఖ ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. గతంలో జబర్దస్త్ షోను అనసూయ యాంకర్ గా చేయగా... ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్‌గా చేస్తూ వస్తోంది. అయితే తాజాగా జబర్దస్త్‌ ఎపిసోడ్‌లో సౌమ్యా రావు అనే కొత్త యాంకర్‌ కనిపించింది.​

దీంతో జబర్దస్త్‌ నుంచి రష్మీని తీసేశారని రకరకాల పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఈ విషయంలో మల్లెమాల సంస్థపై రష్మీ చాలా సీరియస్‌గా ఉందంటూ రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై రష్మి స్పందించింది. ఆమె హీరోయిన్‌గా నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ... సౌమ్య గురించి మల్లెమాల సంస్థ తనకు ముందుగానే చెప్పారని, ఈ విషయంలో ఎలాంటి నెగెటివిటీకి తావు లేదని తెలిపింది.

Advertisement GKSC

అలానే రష్మీ మాట్లాడుతూ... సౌమ్యరావు పై నాకు ఎలాంటి నెగటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను . అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో కొద్దిరోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే వారు నాకు చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. నన్నెవరూ తీసేయలేదు అని చెప్పింది. అంతే కాకుండా ఒకవేళ సౌమ్యరావు వేరే షోల వల్ల బిజీగా ఉండి ... జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా లేదా క్విట్ చేసినా సరే మళ్లీ వెళ్తానని రష్మీ తెలిపింది. కాగా రష్మీ ఇటీవల నందుతో కలిసి నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్‌ లోనూ ఆమె ఓ పాత్రలో నటిస్తోంది.

Advertisement
Author Image