For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : నాకెందుకో కొందరు గుర్తొస్తున్నారంటున్న యాంకర్ అనసూయ..

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
entertainment   నాకెందుకో కొందరు గుర్తొస్తున్నారంటున్న యాంకర్ అనసూయ
Advertisement

Entertainment : బుల్లి తెర యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ నే ఉంటుంది. ఒకవైపు కేరీర్ లో దూసుకెళ్తునే.. మరోవైపు కాంట్రవర్సీలతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..

అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ అనసూయ. బుల్లితెరపై తనదైన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తర్వత పలు టీవీ షో లతోపాటు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది... అలాగే జబర్దస్త్ టీవీ షోతో అనసూయకు ఎంతటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుందో అదే స్థాయిలో వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. టీవీ షోలో విపరితమైన ఎక్స్పోజింగ్తో రెచ్చిపోయి అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం తగ్గకుండా పోస్టులు పెడుతూ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ కూడా చేస్తుంది..

Advertisement GKSC

ఎప్పటికప్పుడు తనపై వస్తున్న ట్రోల్స్ ను లైట్ తీసుకొని అనసూయ.. ప్రస్తుతం మాత్రం కేసు పెట్టి మరీ హెచ్చరిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. ఈ క్రమంలో అనసూయ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో కొందరినీ టార్గెట్ చేస్తూ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. "సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి..నాకెందుకో కొంతమంది గుర్తుకు వస్తున్నారని.. " అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది..

Advertisement
Author Image