Arvind Swamy : అరవింద్ స్వామి ఆస్తి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .. ఏ స్టార్ హీరోకి కూడా ఇంత ఆస్తి ఉండదు..
Arvind Swamy : రోజా, బాంబే, దళపతి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి 90వ దశకంలో ప్రేక్షకులని మెప్పించారు అరవింద్ స్వామి. అప్పట్లో అమ్మాయిలా కల రాకుమారుడిగా అరవింద్ స్వామి బాగా పాపులర్ అయ్యారు. వరుసగా మంచి మంచి సినిమాలు తీశారు. కానీ 2000 సంవత్సరంలో సడెన్ గా సినిమాల నుండి దూరం అయ్యారు. అప్పట్నుంచి తన బిజినెస్ పైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆయనకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది.
అరవింద్ స్వామి సినిమాల నుంచి తప్పుకున్నాక బిజినెస్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. తన తండ్రికి చెన్నైలో ఓ ప్రముఖ కంటి ఆసుపత్రి ఉంది. దాంతో పాటలు కొన్ని చిన్న చిన్న బిజినెస్ లు ఉన్నాయి చెన్నైలో. వాటిని చూసుకుంటూనే ‘ట్యాలెంట్ మ్యాక్సిమస్’ అనే ఓ సంస్థని స్థాపించి ఆ సంస్థని ఓ రేంజ్ లో డెవలప్ చేశారు అరవింద్ స్వామి. ఈ సంస్థ ఎవరికి, ఎక్కడ, ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్ చేస్తుంది. ఒక కన్సల్టెన్సీ సంస్థలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు 3300 కోట్లు. ఇవి కాకుండా చెన్నైలో ఉన్న హాస్పిటల్, తండ్రి, తనవి వ్యాపారాలతో కలిసి అరవిందస్వామికి దాదాపు 4000 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నట్టు సమాచారం.
దీంతో అరవింద్ స్వామికి ఈ రేంజ్ లో ఆస్తి ఉందా, ఇంత పెద్ద వ్యాపారవేత్త అని ఆశ్చర్యపోతున్నారు అంతా. బిజినెస్ లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. తని ఒరువన్(తెలుగులో ధ్రువ) సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి విలన్ గా, ముఖ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ చూసుకుంటూ ఫుల్ సక్సెస్ లో దూసుకుపోతున్నారు.