For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gossip ఛార్మి షాకింగ్‌ నిర్ణయం.. లైగర్‌ ఎఫెక్ట్‌ కారణమా?

12:17 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:17 PM May 13, 2024 IST
gossip ఛార్మి షాకింగ్‌ నిర్ణయం   లైగర్‌ ఎఫెక్ట్‌ కారణమా
Advertisement

Gossip విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్‌ డిసాస్టర్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దింతో చిత్ర నిర్మాత ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉండటానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్‌ పెట్టారు. 'కాస్త శాంతించండి అబ్బాయిలూ.. సోషల్‌మీడియా నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నా. 'పూరీ కనెక్ట్స్‌' సంస్థ మరింత దృఢంగా, ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది' అని ఛార్మి పేర్కొన్నారు.

కాగా, లైగర్‌ ఫ్లాప్‌తో విజయ్‌, ఇతర చిత్రబృందాన్ని నిందిస్తూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఛార్మి, పూరీ కనెక్ట్స్‌ని ట్యాగ్‌ చేస్తూ.. సినిమా అసలేం బాలేదంటూ. కథ, కథనంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్‌ చేశారు. ఛార్మిని సైతం నిందించారు. ఈ చిత్రానికి పూరీ డైరెక్ట్‌ చేయలేదని.. ఛార్మి చేసిందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఛార్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement GKSC

ఇక, ఛార్మి - పూరీ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రానున్న 'జనగణమన'ని నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధం కానున్న ఈ చిత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరకెక్కించడం సరికాదని పూరీ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విజయ్‌తో మాట్లాడి దాన్ని ఆపేశారట.

Advertisement
Author Image