ఆడవాళ్లు మీకు జోహార్లు కంప్లీట్ ఫ్యామిలీ సినిమా - నటి కుష్బూ.
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, కుష్బూ, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.
మార్చి 4న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నటి కుష్బూ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
కేవలం ఆడవాళ్లకు అనే కాదు హ్యూమన్ ఎమోషన్స్కి ప్రాముఖ్యత ఇస్తూ ఈ కథ రాశారు దర్శకుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు ఈ కాన్సెప్ట్ చాలా హిలేరియస్గా కూడా ఉంటుంది. వారు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు అనే కోణం నుండి ఈ కథ రాశాడు.ఈ కథ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో వచ్చి చూసే చిత్రమిది. ముఖ్యంగా ఆడవాళ్లు అందరూ చూడాల్సిన చిత్రం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా.