For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime విషం పెట్టి భర్తనే చంపిన భార్య పోలీసుల విచారణలో నివ్వెర పోయిన నిజాలు వెల్లడి..

12:26 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:26 PM May 13, 2024 IST
crime విషం పెట్టి భర్తనే చంపిన భార్య పోలీసుల విచారణలో నివ్వెర పోయిన నిజాలు వెల్లడి
Advertisement

Crime ఓ మహిళకు రెండేళ్ల క్రితం వివాహం అయింది ఆమెకు భర్త అంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడూ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నది లేదు ప్రతిసారి కారణం చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతూనే ఉండేది అయినా గాని తన పుట్టింటి వాళ్లు బుజ్జగించి చెప్పి తిరిగి భర్త దగ్గరకు పంపిస్తూ ఉండేవారు అయినా కానీ లాభం లేకపోయింది ఇష్టం లేకుండా తను ఆ భర్తతో బతకలేకపోయింది అయితే అంతగా ఇష్టం లేనప్పుడు అతను నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉన్నా సరిపోయేది కానీ చివరికి అతను ప్రాణాలే తీసేద్దాం దారుణానికి ఒడిగట్టింది.. నాలుగు నెలల క్రితం భర్తకు విషం పెట్టి చంపేసింది.. తర్వాత పరారైపోయింది. చివరకు పోలీసులకు దొరికిపోయి షాకింగ్ విషయాలు బయటపెట్టింది..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణ సంఘటన జరిగింది.. బిజ్నోర్‌కు చెందిన యశ్‌పాల్ (35) జూన్ 16వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే మృతుడి మెడపై, మొహంపై గాయాల గుర్తులు కనిపించాయి. తర్వాత ఇంట్లో ఉండాల్సిన అతడి భార్య కవిత ఆచూకీ కనపడలేదు.. అయితే యశ్‌పాల్ తిన్న ఆహారంలో విషం కలవటం వల్ల మరణించాడని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. అతను చనిపోయాక అతడి భార్య కవితపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోసం నాలుగు నెలల పాటు గాలించిన పోలీసులు చివరకు ఆమెను పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement GKSC

విచారణలో ఆ మహిళ షాకింగ్ నిజాలను బయటపెట్టింది వివాహానికి ముందే తను వినీత్ అనే ఒక అబ్బాయిని ప్రేమించానని.. అయినా కానీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తన భర్తకు చెప్పి వదిలేయమని ప్రాధేయపడిన వదలక పోవడంతో చివరికి ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపింది..

Advertisement
Author Image