For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ట్రాఫిక్ సిబ్బందికి నూతన టోపీలు అందజేసిన కమీషనర్

10:57 PM Sep 09, 2024 IST | Sowmya
Updated At - 10:57 PM Sep 09, 2024 IST
ట్రాఫిక్ సిబ్బందికి నూతన టోపీలు అందజేసిన కమీషనర్
Advertisement

Rachakonda News : రాచకొండ పరిధిలో పోలీసు సిబ్బంది సంక్షేమ చర్యలలో భాగంగా రాచకొండ ట్రాఫిక్ వింగ్‌ సిబ్బందికి (500) తెల్లటి టోపీలను ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు, ఐపిఎస్ గారు పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... క్షేత్ర స్థాయి సిబ్బంది శ్రేయస్సుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, రాచకొండ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ఈ టోపీలు ఒక చిరు ప్రశంస అని, వారికి విధి నిర్వహణ మరింత సులభతరం అవుతుంది అని పేర్కొన్నారు.

Advertisement GKSC

క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో ట్రాఫిక్ విభాగ సిబ్బంది రోజువారీ విధుల్లో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న కమిషనర్ తక్షణమే స్పందించి ఎండలు మరియు వర్షం నుండి సిబ్బందికి మరింత సౌకర్యాన్ని మరియు రక్షణను అందించే ఉద్దేశంతో కొత్తగా రూపొందించిన టోపీలను ట్రాఫిక్ సిబ్బంది అందరికి అందించనున్నారు. గతంలో ట్రాఫిక్ సిబ్బందికి ఇవ్వబడ్డ వైట్ హెల్మెట్‌ల బరువు సుమారు 365 గ్రాములు కాగా కొత్త ట్రాఫిక్ టోపీల బరువు 165 గ్రాములు మాత్రమే అనగా 200 గ్రాములు తేలిక. తద్వారా రోజువారీ విధుల నిర్వహణలో ఈ టోపీలు సులభంగా ఉపయోగించడం మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.

ఈ కార్యక్రమంలో సీపీ రాచకొండ శ్రీ G. సుధీర్ బాబు, IPS తో పాటు శ్రీనివాసులు, DCP, ట్రాఫిక్-II మరియు ఇతర ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image