For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లేంటో చూద్దాం..

12:26 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:26 PM May 13, 2024 IST
health వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లేంటో చూద్దాం
Advertisement

Health వర్షాకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది రోజు రోజుకి వర్షాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే ఈ వర్షాలతో పాటు ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో వైరల్ ఫీవర్లు ఇన్ఫెక్షన్స్ తో పాటు దగ్గు జలుబు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే అన్ని రకాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం అయితే వీటితోపాటు ఏ సీజన్లో దొరికే పళ్ళను ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగరు నిరోధక శక్తి పెరిగి ఎన్నో రకాల జబ్బులను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

ప్రత్యేకంగా వర్షాకాలంలోనే కొన్ని రకాల పండ్లు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సేజనల్గా వచ్చే చాలా జబ్బులను ఎదుర్కోవచ్చని తెలుస్తుంది వీటి వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభిస్తుందని అంటున్నారు నిపుణులు అందులో ముందుగా ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే నేరేడు పండు తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని తెలుస్తుంది.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి ఈ కాలంలో నీటి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి అంతేకాకుండా వీటిని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.

Advertisement GKSC

ఈ కాలంలో ఎక్కువగా లభించే మరొక పండు ఆపిల్.. ఆపిల్ పండు తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదని అంటూ ఉంటారు.. యాపిల్‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌, విట‌మిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి..

Advertisement
Author Image