For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్ మరియు ఇద్దరు కూలీలను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు

12:27 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:27 PM May 13, 2024 IST
వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్ మరియు ఇద్దరు కూలీలను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు
Advertisement

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జిట్ No 15 అండర్ పాస్ వద్ద భారీ వర్షం పడటంతో వరద నీరు రోడ్డు పైకి వచ్చినందు వలన సర్వీస్ రోడ్డును బ్యారికేడ్ల సహాయంతో క్లోజ్ చేయడం జరిగింది. రాత్రి పూట ఎవరు లేని సమయంలో ఒక లారీ బ్యారికేడ్లను తీసుకోని ఆ రోడ్డు వెళ్ళడానికి ప్రయత్నించడంతో వరద నీటిలో మునిగి పోయింది. లారీలో ఉన్న డ్రైవర్ మరియు ఇద్దరు కూలీలు టాప్ పై చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ORR పెట్రోల్ మొబైల్ I సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివ శంకర్ మరియు గణేష్ వారిని తల్లా సహాయం తో సురక్షితంగా బయటకు తెచ్చారు.

వాటర్ లాగింగ్ ప్రాంతాలలో, వరద నీటిలో మరియు పోలీసులు నిషేధించిన ప్రాంతాలలో ఎట్టి పరిస్థితులలోను వెళ్లోద్దని సైబరాబాద్ పోలీస్ ల విన్నపం.

Advertisement GKSC

Advertisement
Author Image