For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

లోక్ సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సెల్ పాత్ర అభినందనీయం : సిపి తరుణ్ జోషి ఐపీఎస్

Neque porro quisquam est, qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit, sed quia non numquam eius.
09:54 PM May 24, 2024 IST | Sowmya
Updated At - 09:54 PM May 24, 2024 IST
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సెల్ పాత్ర అభినందనీయం   సిపి తరుణ్ జోషి ఐపీఎస్
Advertisement

ఎన్నికల సెల్ అధికారులు మరియు సిబ్బందికి నగదు రివార్డులు అందించిన కమిషనర్ 

లోక్ సభ ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రాచకొండ ఎన్నికల సెల్ అధికారులు మరియు సిబ్బందిని కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించి నగదు రివార్డులు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సెల్ పనితీరును డీజీపి ఆఫీసుతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు కూడా ప్రశంసించినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ సెల్ పాత్ర ఎంతో ముఖ్యమని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుండి ఎన్నికలు ముగిసే వరకు ప్రతీ దశలోనూ ఎన్నికల సెల్ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, క్షేత్రస్థాయిలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాల పోలీసు సిబ్బందికి ఎలక్షన్ సెల్ చక్కటి మార్గనిర్దేశనం చేసిందని పేర్కొన్నారు.

Advertisement GKSC

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాలలోనూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ సెల్ ద్వారా పర్యవేక్షించడం వల్ల ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసింది అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్లనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని పేర్కొన్నారు.

Advertisement
Author Image