ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు : మురళీమోహన్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2023, హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా" ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ గారి పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, మురళి మోహన్ గారు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు - ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారు, ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంతు కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి శ్రీ మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది.
అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్ గారు, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రఘుకుంచె గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్ గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్ గారు, బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర గారు, బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర గారు, బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి గారు, బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ గారు, బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ గారు, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి గారు, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్ గారు, బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల గారు, బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి గారు, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ గారు, బెస్ట్ డెప్ యు రైటర్ గా అజ్జు మహకాళి గారు, బెస్ట్ రివ్యూ కమిటీ అనగా లక్ష్మణ్ టేకుమూడి గారు, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ గారు ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది.