For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ 1 : హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ

06:40 PM Aug 24, 2023 IST | Sowmya
Updated At - 06:40 PM Aug 24, 2023 IST
దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ 1   హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ
Advertisement

ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మైలార్‌దేవ్‌పల్లి టౌన్ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేవెళ్ళ ఎంపీ డా.రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్సీ రహమత్ బేగ్, తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహకారంతో సుమారు 2ఎకరాల సువిశాలమైన స్థలంలో, రూ.4.5 కోట్ల వ్యయంతో మైలార్‌దేవ్‌పల్లి లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు లా & ఆర్డర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు.

Advertisement GKSC

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పోలీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సహాయసహకారాలు అందిస్తుందన్నారు.

రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విజయవంతమయ్యారన్నారు. దేశంలో ఎక్కడాలేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు. దేశంలోనే 64% సీసీ ఫుటేజీలు మన రాష్ట్రంలోనే పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహాయ సహకారాలందించిన Telangana State Industrial Infrastructure Corporation (TSIIC) మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి గారిని హోంమంత్రి మహమూద్ అలీ సత్కరించారు.

సైబరాబాద్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని, చేవెళ్ళ ఎంపి శ్రీ డా.జి. రంజిత్ రెడ్డి గారిని, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ టి.ప్రకాష్ గౌడ్ గారిని, తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఐపీఎస్., గారిని మరియు మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ టి. శ్రీనివాస్ రెడ్డి గారిని సత్కరించారు. డీసీపీ రాజేంద్రనగర్ జోన్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారిని సత్కరించారు.

మైలార్‌దేవ్‌పల్లి నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు
1. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సహకారంతో సుమారు 2ఎకరాల సువిశాలమైన స్థలంలో మైలార్‌దేవ్‌పల్లి రూ.4.5 కోట్ల వ్యయంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు.
2. మొత్తం 18,648 వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-2 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇన్ స్పెక్టర్ ఛాంబర్(SHO), ఎస్సైల చాంబర్లతో పాటు సెల్ లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో క్రైమ్ ఇన్ స్పెక్టర్ చాంబర్, డైనింగ్ హాల్, రెస్ట్ రూమ్ లు ఉన్నాయి. లో బ్యారక్ తో పాటు ఉంది. సెకండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, చేవెళ్ళ ఎంపి డా.జి. రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్సీ రహమత్ బేగ్, మైలార్‌దేవ్‌పల్లి కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి, భవన కాంట్రాక్టర్ అమరేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ అడ్మిన్ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ రాజేంద్రనగర్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ హర్షవర్ధన్, ఐపీఎస్., డీసీపీ సైబర్ క్రైమ్ శ్రీమతి రితిరాజ్, ఐపీఎస్., విమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్., ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీమతి రష్మి పెరుమాళ్, ఐపీఎస్., రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్ స్పెక్టర్ మధు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image