For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో బాలకవి సమ్మేళనం

10:35 AM May 13, 2024 IST | Sowmya
Updated At - 10:35 AM May 13, 2024 IST
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో బాలకవి సమ్మేళనం
Advertisement

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సంకల్పం మేరకు నిర్వహిస్తున్న స్వతంత్య్ర భారత స్వర్ణోత్సవాలలో భాగంగా 500 మంది బాల కవులు 5 భాషల్లో జాతీయ సమగ్రతను కాంక్షిస్తూ కవితలు రాయడం అద్భుత ఆవిష్కరణ గా చరిత్రలో నిలిచిపోతుందని సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తులో 3 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించిన బాలకవి సమ్మేళనం ముగింపు సమావేశానికి జూలూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Advertisement GKSC

జూలూరి మాట్లాడుతూ... కవితలు వినిపిస్తున్న బాల కవులు మానవీయ విలువలను ఎత్తి పడుతూ లౌకిక భారతదేశానికి పునాదులుగా నిలుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి సారధ్యంలో సంస్థ అనేక విస్తృత కార్యక్రమాలను పలు రంగాలలో నిర్వహిస్తుందని జూలూరి అన్నారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున బాల కవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న చిన్నారులను అతిథులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టీ యస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ , తెలంగాణ జాగృతి సెక్రెటరీ నవీన్ ఆచారి పాల్గొన్నారు

Advertisement
Author Image