For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Political తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణ- వారికి సుప్రీం నోటీసులు

12:23 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:23 PM May 13, 2024 IST
political తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణ  వారికి సుప్రీం నోటీసులు
Advertisement

Political తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌లో ఏపీ, తెలంగాణ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. విభజన చట్టం నిబంధనలు ఆర్టికల్‌ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్ముకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను కూడా జత చేయాలని జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ హ్రిషికేష్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

Advertisement GKSC

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని సవరించనంత వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభలో తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంత వరకూ పెంచడానికి వీల్లేదని పేర్కొంటోందన్నారు.

Advertisement
Author Image