For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime నాటు తుపాకీతో ఉపాధ్యాయుడిపై విద్యార్థి కాల్పులు.. ఆ తర్వాత..

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
crime నాటు తుపాకీతో ఉపాధ్యాయుడిపై విద్యార్థి కాల్పులు    ఆ తర్వాత
Advertisement

Crime ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్‌కి వెళ్లి టీచర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

తనను మందలించాడన్న కారణంతో ప్రిన్సిపల్‌పై ఓ విద్యార్థి ఏకంగా నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్‌ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement GKSC

తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మందలించినందుకు విద్యార్థి ఇంతకు తెగిస్తాడనుకోలేదని ప్రిన్సిపాల్‌ తెలిపాడువిద్యార్థుల ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. ఇటీవల జార్ఖండ్‌లో తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను విద్యార్థులు చెట్టుకు కట్టి కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement
Author Image