For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఉప్పల్‌లో ఘోరం.. తండ్రీకొడుకులను కిరాతకంగా చంపేసిన దుండగులు!

12:27 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:27 PM May 13, 2024 IST
ఉప్పల్‌లో ఘోరం   తండ్రీకొడుకులను కిరాతకంగా చంపేసిన దుండగులు
Advertisement

హైదరాబాద్‌లోని ఉప్పల్ హనుమాన్ సాయి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేశారు. శుక్రవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో ముసుగు వేసుకొని దుండగులు ఇంట్లోకి వెళ్లి హత్య చేశారు.

హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను గొడ్డలితో హత్య చేశారు. వారి కేకలు విని అక్కడికి వచ్చిన పనిమనిషిని కూడా కత్తితో బెదిరించారు. ఉదయం 5.30 సమయంలో ఓ వ్యక్తి బ్లూ టీషర్ట్ వేసుకొని సమీపంలోని గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల కాలనీలు, పరిసరాలు గాలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసం ఈ హత్యలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Advertisement GKSC

శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చారు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయాడు. తండ్రీకొడుకుల హత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

Advertisement
Author Image