Latest Film News : ఎస్జె సూర్య, శ్రీ గొకులం మూవీస్ భారీ పాన్ ఇండియా మూవీ టైటిల్ "కిల్లర్"
మల్టీ టాలెంటెడ్ సూపర్స్టార్ ఎస్జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్, ఈ సినిమాతో తమిళ సినీ రంగంలో కం బ్యాక్ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి. ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు.
‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జె సూర్య, ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఇది ట్రూ పాన్ ఇండియా అనుభూతిని ఇవ్వనుంది.
"కిల్లర్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిభ గల నటులు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రంగా రూపొందించబోతున్నాం ' అని నిర్మాతలు తెలిపారు
త్వరలోనే ఈ చిత్ర తారాగణం, సాంకేతిక బృందం కథా నేపథ్యం వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించనున్నారు.
శ్రీ గొకులం మూవీస్ మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ప్రొడక్షన్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం వారి నిర్మాణంలో సురేశ్ గోపీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఒట్టకొంబన్’, జయసూర్య నటిస్తున్న ఫాంటసీ ఎపిక్ ‘కథనార్’, దిలీప్ హీరోగా వస్తున్న ‘భ భ బా’ ఉన్నాయి. వివిధ భాషల ఈ చిత్రాల ద్వారా గొకులం మూవీస్ వారి నిర్మాణ విలువలు, ఎంటర్ టైన్మెంట్ కోసం చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తోంది.