For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఉత్తమ ప్రతిభ కనబర్చిన CCS పోలీసు సిబ్బందికి రివార్డులు

11:51 PM Aug 14, 2023 IST | Sowmya
Updated At - 11:51 PM Aug 14, 2023 IST
ఉత్తమ ప్రతిభ కనబర్చిన ccs పోలీసు సిబ్బందికి రివార్డులు
Advertisement

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని.. సిసిఎస్ బాలానగర్ జోన్, సిసిఎస్ శంషాబాద్ జోన్, సిసిఎస్ మాదాపూర్ జోన్, సిసిఎస్ మేడ్చల్ జోన్ కు చెందిన పోలీసు సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఈరోజు 14.08.2023 సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు అభినందించి రివార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. సిసిఎస్ సిబ్బంది ఊతమ పనితీరు వల్ల నేడు సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో క్రైమ్ డిటెక్షన్ రేటు 80 శాతానికి పైగా ఉందని తెలిపారు. సిసిఎస్ సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ప్రజల కు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిసిఎస్ మరియు లా&ఆర్డర్ వింగ్స్ ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలన్నారు.

Advertisement GKSC

సిబ్బంది క్రైమ్ డిటెక్షన్ పై రోజువారి సమీక్షలు చేసుకోవాలన్నారు. త్వరలో సీసీఎస్ వింగ్ లో అధునాతనమైన స్పెషలైజ్డ్ టీమ్ ను రూపొందిస్తుమన్నారు. ముఖ్యంగా డాటా అనాలిసిస్ ద్వారా త్వరితగతిన క్రైమ్ కేసులు పరిష్కరించవచ్చన్నారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి సీపీ గారు రివార్డులు అందజేశారు. సిబ్బందికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో సీపీ గారితో పాటు డిసిపి క్రైమ్స్ శ్రీ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి సందీప్, ఏడిసిపి మాదాపూర్ నంద్యాల నరసింహారెడ్డి, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
Author Image