రూ.15 వేలకే జియో ల్యాప్టాప్!
12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
Advertisement
రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జియో ఫోన్లతో మంచి సక్సెస్ అందుకొన్న ఈ దిగ్గజ సంస్థ మరో కొత్త ప్రొడక్ట్ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. జియోబుక్ పేరుతో ల్యాప్టాప్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. అది కూడా కేవలం రూ.15 వేలకే అందించనుంది.
ఈ ల్యాప్టాప్ 4జీ నెట్వర్క్తో పనిచేయనుంది. ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన క్వాల్కామ్ ఎలక్ట్రానిక్స్ చిప్స్ను అందించనున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ కొన్ని యాప్లకు విండోస్ ఓఎస్ను అందించనున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై రిలయన్స్ కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Advertisement
