For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆశ్చర్యపరచే అరుదైన ఘటన...!!

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
ఆశ్చర్యపరచే అరుదైన ఘటన
Advertisement

అప్పుడే పుట్టిన శిశువుల్లో అనారోగ్య సమస్యలు వుండడం మనం వింటూనే వుంటాం. వైద్య ప్రపంచాన్నే విస్తుపరచే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింత. పుట్టి నెల రోజులు కూడా కాని ఓ శిశువు నుంచి 8 పిండాలను వైద్యులు తొలగించారు. అత్యంత అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓ పాప జన్మించింది. ఆ తర్వాత ఆ చిన్నారి కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సీటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. తాజాగా, ఈ నెల 1న కణతుల్ని తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అవి కణతులు కావని, సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు.

Advertisement GKSC

గంటన్నరపాటు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఆయా కేసుల్లో ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని, కానీ నవజాత శిశువులో ఏకంగా 8 పిండాలు ఉన్నాయని, ఇలాంటి ఘటన ప్రపంచంలో ఇదే మొదటిదని వైద్యులు వివరించారు. ఇలాంటి సంఘటనలు వైద్యులకు సవాల్ విసురుతాయి, వారి ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశాన్నిస్తాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకుని శిశువు ప్రాణాన్ని నిలబెట్టిన వైద్యులకు వంద వందనాలు...!!

Advertisement
Author Image