For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health మూత్రాన్ని అధిమి పట్టుకుంటున్నారా.. పెను ప్రమాదం తప్పదు..

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
health మూత్రాన్ని అధిమి పట్టుకుంటున్నారా   పెను ప్రమాదం తప్పదు
Advertisement

Health చాలామందికి మూత్రాన్ని అపే అలవాటు ఉంటుంది ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసే వాళ్ళలో ఈ అలవాటు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది బయట వాష్ రూమ్ లో వాడటం ఇష్టం లేకో... బస్సులో ప్రయాణించే వాళ్లకి అవకాశం లేకనో.. రైళ్లలో బాత్ రూమ్ లు శుభ్రంగా ఉండవనే కారణాలతో చాలా సమయం పాటు మూత్రాన్ని అదుపు చేసుకుంటారు.. అయితే ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. దీర్ఘకాల అరోగ్య సమస్యలు తప్పంటున్నారు వైద్య నిపుణులు..

మూతాన్ని అదుపు చేయడం వల్ల పెను ప్రమాదాలు తప్పవు అంటున్నారు నిపుణులు.. మంటేనే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు వీటిని కచ్చితంగా సమయానికి బయటకు పంపించి తీరాల్సిందే.. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎన్నో దీర్ఘకాల సమస్యలు వేధిస్తాయి.. దీన్ని అదుపు చేయడం వల్ల మూత్రాశయం దగ్గర మంట పుడుతుంది.. ఎలాంటి వారైనా మూత్రాన్ని 20 సెకండ్ల లోగానే పూర్తి చేసుకోవాలి. అలా కాకుండా అంతకు మించిన సమయం పడుతూ ఉంటే కచ్చితంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో తెలుసుకోవాలి లేదా తరచూ మూత్రాన్ని ఆపే అలవాటు ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుంది.

Advertisement GKSC

అయితే మూత్ర విసర్జన సమస్య దీర్ఘకాలంగా ఉంటే కిడ్నీల్లో రాళ్లు, పిత్తాశయంలో వాపు, ప్రోస్టేట్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా మూత్రం ఆలస్యంగా వస్తున్నట్లయితే, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఇలాంటివారు రోజు తప్పనిసరిగా ఆరు నుంచి పది గ్లాసులు నీరు మాత్రం తీసుకోవాలి..

Advertisement
Author Image