For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime : పిల్లలు విదేశాల్లో.. ఒంటరితనంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య..

12:41 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:41 PM May 13, 2024 IST
crime   పిల్లలు విదేశాల్లో    ఒంటరితనంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య
Advertisement

Crime ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని చదువుల కోసం విదేశాలకి పంపిస్తున్నారు. ముఖ్యంగా వారి భవిష్యత్తు బాగుండాలని ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటున్నారు అయితే వాళ్ళు అక్కడికి వెళ్లి సెటిల్ అయిన తర్వాత మాత్రం మళ్లీ తల్లి తండ్రి అసలు గుర్తుంచుకోవడం కూడా మరిచిపోతున్నారు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం వల్ల తల్లిదండ్రి తీవ్ర మనోవేదనకు గురికావడమే కాకుండా వృద్ధాప్యంలో ఒంటరితనానికి లోనవుతున్నారు. ఎక్కడో ఉన్న పిల్లలు వస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తూ వాళ్ళం ఇంకా రాకపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు అయితే ఇలాంటి బాధని అనుభవించిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు..

విశాఖలో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఉన్న దూరంగా ఉన్న పిల్లలు రావడంలేదని బాధతో ఆ వృద్ధ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ వన్ టౌన్ సున్నపు వీధిలో 65 ఏళ్ల సత్యనారాయణ గుప్తా, 62 ఏళ్ల రమణకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. పిల్లల్లో ఒకరు అమెరికాలో… మరొకరు కువైట్లో.. ఇంకొకళ్ళు హైదరాబాదులో ఉన్నారు. విశాఖలో వృద్ధ దంపతులు ఇద్దరు ఒంటరిగానే నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. మెడిసిన్స్ ఎక్కువ మోతాదులో మింగారు. అయితే ఈ క్రమంలో దేశాల్లో ఉన్న కూతురు విశాఖ స్పెషల్ బ్రాంచ్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు.. తమ తల్లిదండ్రుల కాపాడాలని కోరారు దీంతో వెంటనే అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ సుభాన్ వన్ టౌన్ పోలీసులను అలర్ట్ చేయడంతో వారందరూ కలిసి ఆ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లారు అయితే అప్పటికే సత్యనారాయణతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళటంతో భార్యా షాప్ లోకి వెళ్లిపోయింది సకాలంలో పోలీసులు స్పందించి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు దీంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు..

Advertisement GKSC

Advertisement
Author Image