For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'కమిటీ కుర్రోళ్లు' ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది : నిహారిక కొణిదెల

11:15 PM Jun 14, 2024 IST | Sowmya
Updated At - 11:15 PM Jun 14, 2024 IST
 కమిటీ కుర్రోళ్లు  ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది   నిహారిక కొణిదెల
Advertisement

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మేమంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. వంశీ గారు కథను నెరేట్ చేసినప్పుడు పదకొండు మంది జీవితాల్నిచూసినట్టుగా అనిపించింది. మ్యూజిక్‌తో పాటుగా కథను నెరేట్ చేశారు. అప్పుడే మాకు విజువల్‌గా సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది. నాకు కథతో పాటు ఆయన నెరేట్ చేసిన విధానం నచ్చింది. ఎన్నో ఎమోషన్స్‌ అందరికీ టచ్ అవుతుంటాయి. ప్రతీ ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా ఎమోషన్స్‌తో వెళ్లాడు. ఊర్లో ఉండే ప్రతీ ఒక సంఘటన ఇందులో ఉంటుంది. ఊర్లో గొడవలు, రాజకీయాలు, ఆడే ఆటలు అన్నీ ఉంటాయి. పదకొండు మంది జీవితాలను చూపించబోతోన్నాం. 8 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వాళ్ల వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో చూపించబోతోన్నాం. ఎవరో ఒకరు ఏదో ఒక కారెక్టర్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు’ అని అన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image