For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime : ఎవరెస్టు పర్వతారోహనలో తెలంగాణ యువకుడు మృతి..

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
crime   ఎవరెస్టు పర్వతారోహనలో తెలంగాణ యువకుడు మృతి
Advertisement

Crime ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాలని ఎందరో కలలు కంటారు అయితే ఆ కోరికను కొందరు మాత్రమే తీర్చుకోగలుగుతారు.. నిజానికి ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అంతా తేలికైన విషయమేమీ కాదు ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఎవరెస్ట్ పర్వత అధిరోహణ సమయంలో ప్రాణాలు వదిలాడు..

ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.. హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న రాజశేఖర్ రెడ్డి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాలని నిర్ణయించుకున్నాడు ఈనెల మూడవ తేదీన అందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.. రోజు ఇక్కడి నుంచి మొదలైన వేరు 22వ తేదీన నేపాల్ లో మంచి ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురయ్యాడు దీంతో రాజశేఖర్కి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది దీంతో ఆయన అక్కడికక్కడే ఓ లాడ్జిలో ఉంటున్న సమయంలోనే ప్రాణాలు విడిచాడు..

Advertisement GKSC

వివరాల్లోకి వెళితే మృతుడు రాజశేఖర్ రెడ్డికి 32 సంవత్సరాలుగా తెలుస్తోంది అలాగే ఇతను నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన వాడుగా తెలవగా అతను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన ఈయన 22వ తారీఖున ఎంతసేపటికి గదిలోంచి బయటికి రాకపోవడంతో ఏమైందని చూడగా అతను స్థితిలో పడి ఉన్నాడు ఆస్పత్రికి తరలించేటప్పటికీ అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు.. అతని కుటుంబంలో విషాదఛాయలో నెలకొన్నాయి..

Advertisement
Author Image